సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు..!

Read Time:  1 min
CM Chandrababu held meeting with TDP Representatives
CM Chandrababu held meeting with TDP Representatives
FONT SIZE
GET APP

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రను సందర్శిస్తున్నారు. నిన్న దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఆయన శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. అయితే ఈ రోజు విజయనగరం, అనకాపల్లి, విశాఖ జిల్లాలలో పర్యటించాలనుకున్నారు. కానీ విజయనగరం పర్యటన రద్దు అయ్యింది.

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన కారణంగా పర్యటనను రద్దు చేసినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కార్యాలయంగా ప్రకటించారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్ళనున్నారు. ఉదయం 11.15 గంటలకు చింతలగోరువాని పాలెను హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ ఆయన లారస్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెను చేరుకుని, రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో శ్రద్ధ చూపిస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రుషికొండకి హెలికాప్టర్ ద్వారా చేరుకుని, ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.