అమరావతి: జగన్-షర్మిల ఆస్తి వివాదంపై వైఎస్ విజయమ్మ నిన్న (మంగళవారం) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు (బుధవారం) వైఎస్ఆర్సీపీ బహిరంగంగా కఠిన సమాధానం ఇచ్చింది. దివంగత మహానేత వైఎస్ఆర్ భార్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లిగా విజయమ్మ గారి పై తమకు గౌరవంగా ఉంది. అయితే ఆమె విడుదల చేసిన బహిరంగ లేఖ ద్వారా ఆమె షర్మిల ఒత్తిడికి లొంగిపోయారని అర్థమవుతోందని వైఎస్ఆర్సీపీ తెలిపింది. కొన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. విజయమ్మ, జగన్ బెయిల్ రద్దు కుట్రను ప్రస్తావించకపోవడం, దీనిని వివాదంగా మలచాలని ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. “ఇది స్పష్టంగా చంద్రబాబుకు మేలు చేయడం కాదా?” అని ప్రశ్నించారు. “ఇది విజయమ్మగారికి ధర్మం కాదా? ఇద్దరు బిడ్డల మధ్య తటస్థంగా ఉండాల్సిన ఆమె ఇలా పక్షపాతంగా వ్యవహరించడం బాధాకరం. విజయమ్మ యొక్క చర్యలతో వైఎస్ఆర్ అభిమానులు నిరాశ చెందారు” అని పేర్కొన్నారు.
వైఎస్ విజయమ్మ లేఖపై స్పందించిన వైస్ఆర్సీపీ
Read Time:
1 min
రచయిత గురించి
sumalatha chinthakayala
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.