వైఎస్‌ఆర్‌ అభిమానులకు షర్మిల బహిరంగ లేఖ

Read Time:  1 min
Sharmilas open letter to YSR fans
Sharmilas open letter to YSR fans
FONT SIZE
GET APP

అమరావతి: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ద్వారా వైఎస్‌ఆర్‌ గురించి వాస్తవాలను వారికి తెలియజేయాలని ఆమె అన్నారు. వైఎస్‌ఆర్‌ ఎప్పుడూ తనను తక్కువగా చూడలేదని ఆమె స్పష్టం చేశారు. ఆయన సమాన హక్కుల గురించి మాట్లాడేవారిగా పేర్కొన్నారు.

వైఎస్ ఉన్నప్పుడు స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలు మాత్రమేని షర్మిల చెప్పారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాలు జగన్‌కు చెందినవేనని అనుకోవడం తప్పు అని ఆమె పేర్కొన్నారు. జగన్ వాటికి ‘గార్డియన్’గా మాత్రమే ఉన్నారని, సమానంగా పంచిపెట్టడం జగన్ బాధ్యత అని గుర్తు చేశారు.

వైఎస్‌ఆర్‌ ఉద్దేశాలు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుసు. ఆయన జీవించి ఉన్నంతకాలం ఆస్తి పంపకం జరగలేదని చెప్పారు. వైఎస్ మరణించిన తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు జరగలేదని తెలిపారు. ఈరోజు వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఏ ఆస్తి కూడా లేదని షర్మిల తెలిపారు.

వైఎస్ బతికే ఉన్నప్పుడు ఆస్తులు పంచారు అనేది అవాస్తవమని ఆమె పేర్కొన్నారు. తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నాననే విషయాన్ని ఆమె హాస్యాస్పదంగా పేర్కొన్నారు. ఆమెకు వ్యక్తిగతంగా ఆస్తులపై ఆసక్తి లేదని, కేవలం తన పిల్లలకు ఈ ఆస్తులు రావాలని వైఎస్ యొక్క అభిమతం అని షర్మిల స్పష్టం చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.