📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

విమానానికి బాంబు బెదిరింపులు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: November 14, 2024 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయ్పూర్ : దేశంలో ఇటీవల వందలాది విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విమానానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానానికి గురువారం ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాలని భావించారు. అధికారుల అనుమతితో విమానాన్ని రాయ్‌పూర్‌ కు దారి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. అనంతరం ప్రయాణికులనంతా దింపేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్‌ స్వ్కాడ్‌, బాంబ్‌ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకొని విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో రాయ్‌పూర్‌ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ క్రమంలో అక్కడ విమాన రాకపోలకు కొంత అంతరాయం ఏర్పడింది.

కాగా, ల్యాండింగ్‌కు గల కారణం తెలియకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సాంకేతిక సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారని అన్నారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు మొత్తం 187 మంది ప్రయాణికులు ఉన్నారు.

Bomb Threat emergency landing Nagpur to Kolkata Raipur

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.