📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

రెండు రోజుల్లో వరద బాధితుల అకౌంట్లలో డబ్బులు వేస్తాం: చంద్రబాబు

Author Icon By sumalatha chinthakayala
Updated: October 25, 2024 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఇటీవల విజయవాడ నగరంలో బుడమేరు పొంగడంతో భారీ వరద ముంచింది. ఈ వరద కారణంగా చాలా ఇళ్లలోకి నీరు చేరి, ఆవాసాల్లోని అనేక వస్తువులు నష్టపోయాయి. ఇంకా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రైతుల పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారికి నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కానీ, మరికొందరికి ఇంకా డబ్బులు రావాల్సి ఉందని, వారికి అందలేదంటూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు.

సాంకేతిక సమస్యలు తొలగించాలని సీఎం ఆదేశించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే, లబ్ధిదారుల వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా అవగాహన కల్పించాలని చెప్పారు. ఇప్పటివరకు సుమారు నాలుగున్నర లక్షల మందికి రూ.602 కోట్లు జమ అయ్యాయి. కొత్తగా వచ్చిన మూడువేల దరఖాస్తుల్లో 1646 మందికి అర్హత ఉన్నట్లు తేలిపోయింది, వీరిలో 850 మందికి డబ్బులు జమ చేశారు, మిగతావారికి ఇంకా రాలేదు.

చంద్రబాబు, మొదటి విడతలో పరిహారం పొందిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని అధికారులను సూచించారు. బీమా ప్రక్రియ 85 శాతం పూర్తయిందని ముఖ్యమంత్రి తెలిపారు. వరద బాధితుల నష్టపరిహారం విషయమై సమీక్షలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఇళ్లకు నీరు చేరినట్లయితే రూ.25, దుకాణాల వారికి రూ.25, మొదటి అంతస్తులోకి నీరు చేరిన వారికి రూ.10, తోపుడు బండ్ల వ్యాపారులకు రూ.20, ఆటోలు నీటమునిగి మరమ్మతులు జరిగితే రూ.10 చొప్పున ఇచ్చినట్లు తెలిపారు.

Budameru CM chandrababu Flood victims Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.