📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా

Author Icon By Sudheer
Updated: December 6, 2024 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు అందింది. సిబ్బంది తక్షణం అక్కడ పరిశీలనలు జరిపి, అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. వెంటనే బుల్డోజర్‌తో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాలును కూల్చివేశారు. అక్కడ “ఇది ప్రభుత్వ భూమి” అని బోర్డు ఏర్పాటు చేశారు.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో కూడా హైడ్రా అధికారులు చర్యలకు దిగారు. చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన హద్దు గోడలను జేసీబీలతో తొలగించారు. ఖాళీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులన్నింటిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో ప్రజల నుండి ఫిర్యాదులు అధికంగా రావడం ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే హైడ్రా అధికారులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే తక్షణమే సమాచారం అందించాలని, ఆ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

hyderabad hydraa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.