📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: November 13, 2024 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇటివల జిరిబామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 11 మంది సాయుధ గ్రూపు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన అనంతరం ఇంఫాల్లోయలో పలు ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగిందని, ఇరు వర్గాలకు చెందిన సాయుధ సమూహాలు ఎదురు కాల్పులకు పాల్పడ్డాయని పోలీసులు తెలిపారు. దీంతో మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని, భద్రతా అధికారులు తెలిపారు.

కాగా, సోమవారం సాయంత్రం ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లో వివిధ గ్రామాల నుండి హింసాత్మక ఘర్షణలు నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అదే సమయంలో తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఎన్కౌటర్లో మరణించినవారంతా కుకీ తెగకు చెందినవారని స్థానిక మీడియా వెల్లడించింది. కుకీల హత్యకు నిరసనగా కొండిపాంతాల్లోని ఆ తెగ మెజారిటీగా ఉండే ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 5.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. అదే సమయంలో తప్పిపోయిన వ్యక్తుల జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించబడింది అధికారులు చెప్పారు.

Curfew Jiribam District Manipur violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.