బాపూ ఘాట్‌లో భారీ మహాత్మా గాంధీజీ విగ్రహం ఏర్పాటు – సీఎం రేవంత్

Read Time:  1 min
gandhi statue
gandhi statue
FONT SIZE
GET APP

ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రపంచానికి చాటాలని చెప్పారు. దీనిలో భాగంగా, సర్దార్ పటేల్ విగ్రహం తరహాలో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని బాపూఘాట్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ప్రకటించారు.

రెవంత్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ అభివృద్ధి ప్రాజెక్టులపై అడ్డు పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదని విమర్శిస్తూ, ఫాంహౌస్ పాలిటిక్స్‌ను ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావడం కుదరకపోవడం దురదృష్టకరమని అన్నారు.

మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టును కూడా బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందో ప్రస్తావిస్తూ, గుజరాత్‌లో సబర్మతీ నది ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చిన కేంద్రం, తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో, రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తగినంత సహకరించడం లేదని విమర్శిస్తూ, తెలంగాణలోని ప్రజలు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అభివృద్ధి మద్దతు తీసుకోలేకపోతున్నారని అన్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.