📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్సీ

Author Icon By Sudheer
Updated: November 13, 2024 • 7:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి వైసీపీ కీలక నేతలు పార్టీని వీడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాల పర్వం ఎక్కువైంది. మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , కీలక నేతలు ఇలా చాలామంది వైసీపీ బై బై చెప్పి టిడిపి , జనసేన లో చేరుతూ వచ్చారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ముగ్గురు ఎమ్మెల్సీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

వీరిలో జగన్‌కు అత్యంత నమ్మకస్తులు కూడా ఉన్నారు. ఆళ్ల నాని , బాలినేని వంటి వారు జగన్‌కు ఆప్తులు. వీరికి జగన్ మంత్రి పదవులు కేటాయించారు. వీరు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. బీద మస్తార్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్‌ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు తమ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు . ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కూడా పార్టీని వీడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం మొదలైంది.

అయితే ఈ వార్తలపై ఎమ్మెల్సీ రవీంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలిపారు. ప్రజలు ఈ వార్తలను నమ్మవద్దు అని సూచించారు. ఈ క్రమంలో ‘నాకు వైసీపీని వీడాల్సిన అవసరం లేదు’ అని ఎమ్మెల్సీ రవీంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌తోనే నా ప్రయాణం అని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో ఎవరూ చేయని విధంగా మాజీ సీఎం జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు.

MLC Pandula Ravindra Babu ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.