పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష

Read Time:  1 min
నేడు ఏపిలో 'పల్లె పండుగ' కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
నేడు ఏపిలో 'పల్లె పండుగ' కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
FONT SIZE
GET APP

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం కచ్చితంగా జరిగేలా చూసుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్లు ఇప్పుడు అవకాసం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఇతర అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాల ప్రకారం జరిగేలా తనిఖీలు నిర్వహించాలని, పర్యవేక్షణ కఠినంగా చేయాలని ఆయన సూచించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.