📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..!

Author Icon By sumalatha chinthakayala
Updated: November 2, 2024 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణం లేదని, ఇది సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది కాకుండా.. వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన జేపీసీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో సమర్పించవచ్చు. దీనిపై దుమారం రేగే అవకాశాలు కూడా ఉన్నాయి.

వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పైను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆమోదించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా గతంలో తెలిపిన విషయం విదితమే. అయితే నవంబర్ 26న లోక్‌సభ, రాజ్యసభ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని పిలవవచ్చు. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న ఈ ఉభయ సభలు జరగనున్నాయి. పాత పార్లమెంట్ హౌస్‌లో ఒకరోజు ఉభయ సభలు జరిగే అవకాశం ఉంది. పాత పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లోని రాజ్యాంగ సభలో ఈ ప్రత్యేక ఉభయ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ స్థలంలోనే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. అందుకే ఇప్పుడు నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది.

Home Minister Amit Shah November 25 Parliament Waqf Bill winter session

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.