📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!

Author Icon By sumalatha chinthakayala
Updated: October 24, 2024 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు 200 రైళ్లను రద్దు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే కేంద్రాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. రద్దు చేయబడిన రైళ్లు గురువారం నుంచి ఈ నెల 29 వరకు నిలిపివేయబడ్డాయని అధికారులు తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు..

ఒడిశా తీర ప్రాంతంలో దానా తుఫాన్‌ ప్రభావం కారణంగా ఈ నెల 24న 41 రైళ్లను, తదుపరి 17 రైళ్లను రద్దు చేయడం జరిగింది. తాజా రద్దు గురువారం నుంచి 29 తేదీ వరకు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రధాన రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రద్దయిన రైళ్ల జాబితా..

ఈనెల 24న రద్దైన రైళ్లు..

ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌-హావ్‌డా(22888) హమ్‌సఫర్, భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి(11020) కోణార్క్, భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌(12830), హైదరాబాద్‌-షాలిమార్‌(18046) ఈస్ట్‌కోస్టు..,

ఈనెల 25న రద్దైన రైళ్లు..

చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ (12829), భువనేశ్వర్‌-విశాఖ (20841) వందేభారత్, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (17015) విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌- కేఎస్‌ఆర్‌ బెంగళూర్‌(17015) ప్రశాంతి, భువనేశ్వర్‌-రామేశ్వరం(20896), పూరీ-యశ్వంత్‌పూర్‌(22883) గరీబ్‌రథ్‌ను రద్దు చేశారు.

ఈనెల 26న రద్దైన రైళ్లు..

పూరీ-గాంధీధామ్‌ (22974), సికింద్రాబాద్‌-సిల్చార్‌ (12513), యశ్వంత్‌పూర్‌-పూరీ (22884) గరీబ్‌రథ్, మంగళూర్‌ సెంట్రల్‌- సంత్రాగచ్చి (22852), ఎస్‌ఎంవీ బెంగళూర్‌-కామాఖ్య(12551),

ఈనెల 27న రద్దైన రైళ్లు..

రామేశ్వరం-భువనేశ్వర్‌ (20895), వాస్కోడిగామ-షాలిమార్‌ (18048) అమరావతి,

ఈనెల 29న రద్దైన రైళ్లు..

మాల్దా టౌన్‌-సికింద్రాబాద్‌ (03430) రైళ్లను రద్దు చేశారు.

కాగా, సహాయ కేంద్రాలు ప్రయాణికుల సౌలభ్యం కోసం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, ఖమ్మం, వరంగల్‌, రాజమండ్రి వంటి స్టేషన్లలో 24 గంటలపాటు సేవలు అందించే హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని అంచనాతో, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రైళ్ల నిర్వహణపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

.29 trains cancelled Ap Railway department Telangana Typhoon effect

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.