తిరుమల భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

Read Time:  1 min
tirumala devotees
tirumala devotees
FONT SIZE
GET APP

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తుల ఆరోగ్యంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ ఈ మార్గదర్శకాలను అందించింది.

టీటీడీ సూచనలు:
పెద్దవారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సూచన: 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, బీపీ, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్నవారు కాలినడకన రావడం ఆరోగ్యానికీ ప్రమాదకరమని పేర్కొంది. అలాంటి భక్తులు బస్సు ద్వారా కొండపైకి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించింది.

ఆక్సిజన్ స్థాయిపై అవగాహన: సముద్రమట్టానికి ఎత్తులో ఉండడం వల్ల తిరుమలలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది శరీరంపై ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైద్య సూచనలు పాటిస్తూ ముందుకుసాగాలని సూచించింది.

తవ్వించిన వైద్య సదుపాయాలు: కాలినడక భక్తులకు 1500 మెట్టు వద్ద, గాలిగోపురం, భాష్య కార్ల సన్నిధి వద్ద, అలాగే తిరుమలలోని అశ్విని ఆసుపత్రి వంటి ప్రాంతాల్లో వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది.

రోజువారి మందులు తీసుకురావడం: ప్రత్యేకించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వారి రోజువారీ మందులు వెంట తెచ్చుకోవాలని సూచించింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.