📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ..

Author Icon By Sudheer
Updated: October 26, 2024 • 7:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఉన్న మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కెమికల్ గ్యాస్ లీక్ జరిగి, కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయ విపత్తుల స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనను పరిశీలించినప్పటికీ, ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పాఠశాల ల్యాబ్ నుండి ఎలాంటి గ్యాస్ వెలువడలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమయంలో, విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి కళ్లలో చికాకు, మరికొందరు అకస్మాత్తుగా వికారంగా ఉన్నారని చెప్పారు.

విద్యార్థులు మాట్లాడుతూ, “గాలి కోసం కొన్ని మంది క్లాస్ నుంచి బయటకు పరుగెత్తారు. ఉపాధ్యాయులు కూడా ఇబ్బందిపడ్డారు. కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు” అన్నారు. చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఫిర్యాదు చేయడంతో, స్కూల్ యాజమాన్యం అంబులెన్స్‌లు పిలిచి విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడంతో, పలువురు ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. స్కూల్ నుంచి లీకేజీ జరిగిందా లేక కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి వచ్చిందా అనే దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, దాదాపు 30 మంది విద్యార్థులు అసౌకర్యం మరియు గొంతునొప్పితో ఫిర్యాదు చేశారు. అనుమానిత రసాయన వాయువు లీకేజీకి సంబంధించిన కారణాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.

Chemical gas leak Tamilanadu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.