हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ..

Sudheer
తమిళనాడులో కెమికల్ గ్యాస్ లీకేజీ..

తమిళనాడులోని తిరువొత్తియూరులో ఉన్న మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కెమికల్ గ్యాస్ లీక్ జరిగి, కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు.

జాతీయ విపత్తుల స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనను పరిశీలించినప్పటికీ, ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. పాఠశాల ల్యాబ్ నుండి ఎలాంటి గ్యాస్ వెలువడలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమయంలో, విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి కళ్లలో చికాకు, మరికొందరు అకస్మాత్తుగా వికారంగా ఉన్నారని చెప్పారు.

విద్యార్థులు మాట్లాడుతూ, “గాలి కోసం కొన్ని మంది క్లాస్ నుంచి బయటకు పరుగెత్తారు. ఉపాధ్యాయులు కూడా ఇబ్బందిపడ్డారు. కొంతమంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు” అన్నారు. చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఫిర్యాదు చేయడంతో, స్కూల్ యాజమాన్యం అంబులెన్స్‌లు పిలిచి విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడంతో, పలువురు ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. స్కూల్ నుంచి లీకేజీ జరిగిందా లేక కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి వచ్చిందా అనే దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, దాదాపు 30 మంది విద్యార్థులు అసౌకర్యం మరియు గొంతునొప్పితో ఫిర్యాదు చేశారు. అనుమానిత రసాయన వాయువు లీకేజీకి సంబంధించిన కారణాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870