📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత

Author Icon By sumalatha chinthakayala
Updated: April 16, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నిన్న రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల హోం శాఖా కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవిని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యా ఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేరాల విషయంలో అందరమూ బాధపడుతున్నామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ బయటపడ్డారు.. మేం పడలేదు.. అంతే తేడా అని చెప్పారు. ఆయనతో క్లారిటీగా మాట్లాడానని, సోమవారం పవన్ మాట్లాడిన మాటలను పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ మేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మహిళలపై అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలపై చర్చించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపామన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్‌ జరగడం బాధాకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయంగా నేరాలు ప్రోత్సహించడమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులకు వెంటనే శిక్షలు విధించి, అమలు చేయడానికి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అనిత చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జగన్ కు భావప్రకటన స్వేచ్ఛ ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లుంది.. గత ప్రభుత్వ హయాంలోనూ పోలీసులు ఇబ్బంది పడ్డ విషయం మాత్రం గుర్తులేదని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.

Ap Deputy CM Pawan Kalyan Home Minister Anitha Law and order TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.