📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Author Icon By sumalatha chinthakayala
Updated: October 26, 2024 • 1:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన ఆయన, తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు.

రూ. లక్ష చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కేటాయించనున్నారు. రూ. వంద చెల్లించిన సభ్యులకు గతంలో ఉన్న రూ. 2 లక్షల ప్రమాద బీమాను రూ. 5 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. సభ్యత్వ కార్డు కలిగిన వ్యక్తి చనిపోయిన రోజున, అంత్యక్రియలకు రూ. 10,000 అందించనున్నట్లు తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సహాయం అందించనుంది. ఈ నేపథ్యంలో, సభ్యత్వ నమోదును ప్రాధాన్యంగా తీసుకుని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని సిఎం చంద్రబాబు అభ్యర్థించారు.

ఈ సారి, ఆన్‌లైన్ డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలుగుదేశం నేతలు వెల్లడించారు. సభ్యత్వ నమోదు చేసిన కార్యకర్తలతో ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్‌లో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంలో, సభ్యత్వ నమోదు విధానాలను కరపత్రంగా విడుదల చేశారు. మాచర్లలో హత్యకు గురైన చంద్రయ్య కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. నామినేటెడ్ పదవుల జాప్యం అంశంపై అంజిరెడ్డి చేసిన ప్రసంగం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 42 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన అంజిరెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత పదవి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో, మూడు నెలలలో కూడా పదవి అందకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని వ్యాఖ్యానించారు.

అంజిరెడ్డి మాటలపై చంద్రబాబు ఆసక్తి కనబరిచారు. ఆశావహుల సంఖ్య పెరుగుతున్నందున జాప్యం జరుగుతున్నదని అంజిరెడ్డికి ఆయన వివరించారు. సరైన వారిని సరైన పదవిలో నియమిస్తానని అన్నారు. సభ్యత్వ నమోదు చేసిన తెలంగాణ మరియు అండమాన్ ప్రాంతాల నేతలతో కూడా సీఎం స్వయంగా మాట్లాడారు. సభ్యత్వ నమోదును ప్రాధాన్యతగా తీసుకుని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో, రూ. లక్ష చెల్లించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శాశ్వత సభ్యత్వం పొందారు.

CM chandrababu Mangalagiri TDP membership registration program

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.