📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ నియామకం

Author Icon By sumalatha chinthakayala
Updated: November 4, 2024 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సీఎం ఒమర్‌ అబ్దుల్లా సమక్షంలో ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌.. అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్‌ రహీమ్‌ పేరును ప్రతిపాదించారు. కాగా, అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బుద్గాం జిల్లాలోని చరార్‌-ఇ-షరీఫ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేడు తొలిరోజు సభను ఉద్దేశించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రసంగించనున్నారు.

కాగా, స్పీకర్‌ పదవికి పోటీ చేయకూడదని ప్రతిపక్షాలు నిర్ణయించడంతో మూజువాణి ఓటుతో అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌ ఎన్నికలు నిర్వహించారు. వ్యవసాయ మంత్రి జావేద్‌ అహ్మద్‌ దార్‌ స్పీకర్‌ పదవికి అబ్దుల్‌ రహీమ్‌ను ఎంపిక చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎన్‌సి ఎమ్మెల్యే రాంబన్‌ అర్జున్‌ ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఎన్నికల అనంతరం, శాసనసభ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్‌ శర్మలు అబ్దుల్‌ రహీమ్‌ వెంట వెళ్లగా ఆయన స్పీకర్‌ కుర్చీని అధిరోహించారు. నేటి నుండి ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అబ్దుల్‌ రహీమ్‌ గతంలో కూడా జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో స్పీకర్‌ పదవిని చేపట్టారు. పిడిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 2002-2008 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2018లో చివరిగా జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆరేళ్లకు పైగా విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశమైంది.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. ఈ క్రమంలోనే దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి.

Abdul Rahim Rather CM Omar Abdullah Jammu Kashmir Assembly Speaker National Conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.