📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

జనవరి 10 నుండి వైకుంఠద్వారదర్శనం

Author Icon By Uday Kumar
Updated: December 11, 2024 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

-10న వైకుంఠ ఏకాదశి, 11న ద్వాదశి

తిరుమల, డిసెంబర్ 10 ప్రభాతవార్త ప్రతినిధి:

ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠద్వార దర్శనాలకు సమయం సమీపిస్తోంది. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ద్వాదశిని వైకుంఠద్వాదశిగా ప్రసిద్ధి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మోక్షమార్గం వైకుంఠద్వారం రానున్న జనవరి 10వతేదీ తెల్లవారుజామున 1.45 గంటలకు తెరచుకోనుంది. రానున్న ఏడాదిలో కూడా పదిరోజులుపాటు వైకుంకద్వారం తెరచి భక్తులకు మోక్షమార్గం దర్శనం చేయించేలా టిటిడి ఇఒ శ్యామలరావు, అదనపు చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పదిరోజులపాటు దాదాపు 7 లక్షలమంది భక్తులు ఆరోజుల్లో వైకుందద్వార దర్శనం చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేయనుంది. జనవరిలో వైకుంఠ ద్వారం తెరచి ఉంచే 10వతేదీ నుండి జనవరి 19వరకు పదిరోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు. దర్శన టిక్కెట్, టోకెన్లు లేని భక్తులను ఆలయంలోపలకు అనుమతించరు. రాజ్యాంగపరిధిలోని ప్రొటోకాల్ విఐపీలు స్వయంగా వస్తేనే పరిమితంగా బ్రేక్ దర్శనాలు జారీచేస్తారు. ప్రత్యేక దర్శనాలు చంటిపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఎన్ఆర్వలు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేశారు. వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం. శ్రీవాణి ట్రస్ట్, తిరుపతిలో ఆన్లైన్లో టోకెన్లు జారీచేయనున్నారు.

-జనవరి 10న స్వర్ణరథం, 11న చక్రస్నానం:

పవిత్రమైన ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన జనవరి 10వతేదీ శుక్రవారం ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు స్వర్ణరథం జరుగుతంది. శ్రీదేవిభూదేవిసమేతంగా మలయప్పస్వామివారు విశేష అలంకరణలో స్వర్ణరథాన్ని అధిరోహించి. ఆలయ మాధవీడుల్లో ఊరేగనున్నారు. 11వతేదీ ద్వాదశిరోజు పవిత్ర పుష్కరిణిలో స్వామివారి చక్రత్తాశ్వార్కు చక్రస్నాన మహోత్సవం జరిపిస్తారు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.