📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

గుస్సాడీ క‌న‌క‌రాజు మృతిపై సీఎం దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Author Icon By sumalatha chinthakayala
Updated: October 26, 2024 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, ప‌ద్మ‌శ్రీ క‌న‌కరాజు, అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఆదివాసీల సంప్రదాయ ప్రకారం జరగనున్నాయి.

క‌న‌కరాజు మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటు అని పేర్కొన్నాడు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం వంటి గొప్ప కృషిని క‌న‌కరాజు అందించాడు అని కొనియాడారు.

ఆదివాసీ కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన క‌న‌కరాజు మ‌ర‌ణం త‌న‌ను తీవ్రంగా కలిచివేసిందంటూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క‌న‌కరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాల‌తో నిర్వహించాల‌ని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

కాగా, ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యం అందరినీ అలరిస్తూ వచ్చిన క‌న‌కరాజు ఈసారి పండుగకు కొన్ని రోజుల ముందు మరణించడంతో ఆదివాసీలు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రోత్సహించేందుకు చేసిన కృషికి 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప‌ద్మ‌శ్రీ పురస్కారం అందించిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy funeral Gussadi Kanaka Raju Jainoor Komaram Bheem Asifabad District Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.