📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్

Author Icon By Sudheer
Updated: November 14, 2024 • 7:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కె. రఘురామకృష్ణరాజు ప్రకటన అనంతరం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుపెట్టనివ్వబోమని సవాల్ చేసిన వారు ఈరోజు మీ ముందు అసెంబ్లీలోనే లేరని… కర్మ అంటే ఇదే. రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక కాగా, రఘురామ ముందుకు వారు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు… ఇది ప్రజాస్వామ్యం గొప్పదనం అని పవన్ వివరించారు.

“గత ప్రభుత్వంలో మనమందరం ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం… గత ప్రభుత్వ హయాంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి… ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పోరాట పటిమ అభినందనీయం… ఉండి అసెంబ్లీ స్థానం నుంచి 56 వేలకు పైగా మెజారిటీతో మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ పదవికి వన్నె తెచ్చి, సభను గౌరవ సభగా ఉన్నత స్థానానికి చేర్చుతారని ఆశిస్తున్నాను. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని 2014లో వారిని నిలువరించామన్నారు. అయితే 2019లో అలా కుదరలేదని.. ఆ సమయంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగాయని అన్నారు.

సుప్రీంకోర్టు జడ్జీలు, పార్టీల్లోని కార్యకర్తలు, సొంత పార్టీ ఎంపీ అయిన ట్రిపుల్ ఆర్‌ను వారు వదల లేదన్నారు. ఆయన్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా హింసించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ట్రిపుల్ ఆర్‌ను అరెస్ట్ చేస్తారనుకున్నాం.. కానీ థర్డ్ డిగ్రీ మెథడ్ వాడడంతో భయం కలిగిందన్నారు. దీంతో తామకు ఆవేదన కలిగిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న తన కోరిక వల్లే.. నేడు డిప్యూటీ స్పీకర్‌గా మిమ్మల్ని చూస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అందరం కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ సభకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీ మాటకు పదనుతోపాటు హస్యం సైతం ఉంటుందన్నారు.

Pawan Kalyan Raghurama Krishnam Raju

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.