📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఈరోజు ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ మహా దర్నా..

Author Icon By sumalatha chinthakayala
Updated: October 25, 2024 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: హైడ్రా, మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఈరోజు(శుక్రవారం) ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించనుంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధితులతో ముఖాముఖి సమావేశాలు జరుపుతారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.

హైదరాబాద్‌లోని మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి బీజేపీ మహా ధర్నాకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా జరుగుతుంది. ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ నేతలు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. మూసీ బాధిత ప్రాంతాల్లో పర్యటించి, 9 బృందాలుగా ఏర్పడి బాధితులకు భరోసా ఇచ్చారు.

మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ప్రాతిపదికను కోల్పోకుండా పోరాడుతుందని నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రోజు విభిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. డీపీఆర్ ఇవ్వకుండా అఖిలపక్షం సమావేశం ఎందుకు అని ప్రశ్నించారు. సుందరీకరణ చేస్తే బాధితులను ఇబ్బంది పెట్టకుండా మద్దతు ఇస్తామన్నారు.

అంతేకాదు.. ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీడబోమని బీజేపీ స్పష్టం చేసింది. రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్‌కు అడ్డుపడతామని హెచ్చరించింది. రైతుల భరోసా కోసం కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. రైతుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వారికి మోసం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ జరిగిందో అధికారికంగా వెల్లడించాలంటూ డిమాండ్ చేసింది.

Bandi sanjay BJP BJP Maha Dharna Congress govt Indira Park Kishan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.