📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: November 5, 2024 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటలో ప్రయాణించారు. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఆయన ఆటోలో కూర్చొని వెళుతుండగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు.

కాగా, ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఆటో, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిని వెంటనే అమలు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. యాప్‌లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ వీలర్లను నిషేధించాలని కోరుతున్నారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కు ముందు యావరేజ్ గా రూ.1000 సంపాదన ఉంటే.. ఇప్పుడు రూ.500 కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

Auto Drivers brs hyderabad Indira Park ktr Maha dharna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.