ఆందోళనకు దిగిన వైస్ షర్మిల

Read Time:  1 min
sharmila dharna
sharmila dharna
FONT SIZE
GET APP

విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) చీఫ్ వై. ఎస్. షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నేటి నుండి మూడు రోజులపాటు నిరసనలు నిర్వహించబోతున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించేందుకు షర్మిల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొననున్నారు. ముఖ్యంగా విద్యుత్ వినియోగదారుల భారం తగ్గించాలన్న లక్ష్యంతో, ఈ మూడు రోజుల ఆందోళనలను చేపట్టబోతున్నారు. షర్మిల పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీల రూపంలో ఆందోళనలు జరపనున్నారు.

షర్మిల ప్రకటనలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలన్న డిమాండ్‌తోపాటు, విద్యుత్ ఛార్జీలను పెంచడానికి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేయాలని షర్మిల అన్నారు. ప్రజల భారం తగ్గించాల్సిన అవసరాన్ని ఉటంకిస్తూ, ఆమె అధికార పార్టీపై విమర్శలు చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.