📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య

Author Icon By Uday Kumar
Updated: December 12, 2024 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య

ఉప్పల్ : ఒకపక్క అనారోగ్య సమస్యలు, మరో వైపు ఉన్న ఒక్క కుమారుడు తమకు దూరంగా ఉండడం, వృధ్యాప్యంలో వచ్చిన సమస్యలు తట్టుకోలేక ఉప్పల్ లో వృద్ధ దంపతులు గుర్తు తెలియని టాబ్లెట్ లు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ సాయిరాంనగర్ కాలనీలో నివసించే దుర్వాసుల సూర్యనారాయణశాస్త్రి (60) ఎన్టిపిసిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. అతనికి భార్య దుర్వాసుల జగదీశ్వరి (54)తోపాటు ఒక కుమారుడు డి.సాయి సుశాంత్ (30) ఉన్నాడు. అతనికి పెళ్లి చేయగా స్టాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా కోకాపేటలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా సూర్యనారాయణశాస్త్రి భార్య జగదీశ్వరి అనారోగ్యంతో బాధపడుతోంది. పలు అనుపుత్రులు తిరిగినా నయం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 5వ తేది తమ కుమారుడు ఢిల్లీ సెమినార్కు వెళుతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పటి నుంచి వీరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వీరి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రతి రోజు పని మనిషి బయట నుంచే వెళ్ళిపోతోంది. కాగా బుధవారం ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుందడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మాధవరెడ్డి, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని తలుపులు వగులగొట్టి చూడగా ఇంట్లో ఇద్దరు విగత జీవులుగా పది ఉన్నారు. తమ చావుకు ఎవరు కారణం కాదని లెటర్ రాసి పెట్టినట్లు వారు తెలిపారు. వయోభారం, అనారోగ్యం కారణంగానే అత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే షష్టిపూర్తి ఘనంగా చేసుకున్నారని, అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రంగా కలిచివేసిందని స్థానికులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

hyderabad Illness uppal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.