📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య

Author Icon By Uday Kumar
Updated: December 12, 2024 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్యహత్య

ఉప్పల్ : ఒకపక్క అనారోగ్య సమస్యలు, మరో వైపు ఉన్న ఒక్క కుమారుడు తమకు దూరంగా ఉండడం, వృధ్యాప్యంలో వచ్చిన సమస్యలు తట్టుకోలేక ఉప్పల్ లో వృద్ధ దంపతులు గుర్తు తెలియని టాబ్లెట్ లు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉప్పల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ సాయిరాంనగర్ కాలనీలో నివసించే దుర్వాసుల సూర్యనారాయణశాస్త్రి (60) ఎన్టిపిసిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. అతనికి భార్య దుర్వాసుల జగదీశ్వరి (54)తోపాటు ఒక కుమారుడు డి.సాయి సుశాంత్ (30) ఉన్నాడు. అతనికి పెళ్లి చేయగా స్టాఫ్ట్వేర్ ఉద్యోగం కారణంగా కోకాపేటలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా సూర్యనారాయణశాస్త్రి భార్య జగదీశ్వరి అనారోగ్యంతో బాధపడుతోంది. పలు అనుపుత్రులు తిరిగినా నయం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 5వ తేది తమ కుమారుడు ఢిల్లీ సెమినార్కు వెళుతున్నట్లు చెప్పినట్లు తెలిపారు. అప్పటి నుంచి వీరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వీరి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రతి రోజు పని మనిషి బయట నుంచే వెళ్ళిపోతోంది. కాగా బుధవారం ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుందడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మాధవరెడ్డి, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని తలుపులు వగులగొట్టి చూడగా ఇంట్లో ఇద్దరు విగత జీవులుగా పది ఉన్నారు. తమ చావుకు ఎవరు కారణం కాదని లెటర్ రాసి పెట్టినట్లు వారు తెలిపారు. వయోభారం, అనారోగ్యం కారణంగానే అత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితమే షష్టిపూర్తి ఘనంగా చేసుకున్నారని, అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రంగా కలిచివేసిందని స్థానికులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

hyderabad Illness uppal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.