పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం – విజయసాయి రెడ్డి

Read Time:  1 min
polavaram
polavaram
FONT SIZE
GET APP

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పలు అంశాలను ప్రస్తావిస్తూ, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి పేర్కొన్నట్టుగా, చంద్రబాబు అధికారంలోకి వచ్చి, ప్రాజెక్టు ఎత్తును తగ్గించడం రాష్ట్ర ప్రజలకు ద్రోహంగా మారిందని అన్నారు. ఆయన చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ, ప్రాజెక్టు నిధులను దారి మళ్లించడం మాత్రమే కాకుండా, ప్రజల తాగు, సాగు నీటి అవసరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.
ప్రజలు చంద్రబాబు దుర్మార్గాలను గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.