ఒడిశా భద్రక్ జిల్లాలోని మణినాథ్పూర్ గ్రామం (Maninathpur village in Bhadrak district of Odisha) లో ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతున్నాయి. ఈ గ్రామ శ్మశానవాటిక (Cemetery) నుంచి మృతదేహాలు వరుసగా మాయమవుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.గత కొన్ని వారాల్లో నాలుగు మృతదేహాలు కనిపించకుండా పోయాయి. ఈ సంఘటనలతో గ్రామంలో భయం పెరుగుతోంది. 2017 నుంచి ఇప్పటివరకు 15 మృతదేహాలు మాయమైనట్లు సమాచారం.

తాజా ఘటన కలకలం రేపింది
ఇటీవల ఓ మహిళ మరణించగా, కుటుంబ సభ్యులు ఆమెను పూడ్చిపెట్టారు. పది రోజుల తర్వాత కర్మల కోసం శ్మశానానికి వెళ్లారు. అయితే అక్కడ తవ్వకం జరిగి ఉండడం గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహం కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మాఫియా అనుమానాలు వ్యక్తం
ఈ ఘటనల వెనుక వైద్య కళాశాలల మాఫియా ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల కోసం మృతదేహాలను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు దర్యాప్తు ముమ్మరం
గ్రామస్థుల ఫిర్యాదులపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్మశానవాటికలో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో మొత్తం జిల్లా ఉలిక్కిపడింది.గ్రామ ప్రజలు శ్మశానవాటికలో భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
Read Also : Jaipur Airport : జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు