हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యం – ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Sharanya
Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యం – ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ (సైఫాబాద్): మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమ ంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఏడాది మహిళా సంఘాలకు 20 వేల కోట్లు వడ్డిలేని రుణాలను (Interest-free loans) అందిస్తున్నామని చెప్పారు.

లింగ సమానత్వం-లింగ స్పష్టత కార్యక్రమం

నిజాం కళాశాల, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం లింగ సమానత్వం-లింగ స్పష్టత కార్యక్రమం (Gender Equality-Gender Clarity Program) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లుభట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ విద్యా సంస్థలు లింగ సమానత కలిగిన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ కృషి వల్ల నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా ఉండి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం వల్లనే జెండర్ ఈక్వాలిటితో పాటు ఈక్వల్ రిజర్వేషన్లు, డౌరి ప్రొహిబిషన్ చట్టాలు అమలు జరిగాయని ఆయనగుర్తు చేశారు. మహిళల సాధికారత రక్షణ, సమగ్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను కలిగియున్నదని ఆయన గుర్తు చేశారు.

మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న దృఢమైన చర్యలను ఆయన వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయ సంఘాల ప్రోత్సహం మహిళలకు ఆర్టీసీ బస్లలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం, సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించడం, ఆర్థిక స్వాలంబన నిజమైన సాధికారతకు కీలకమన్నారు. అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను నిజాం కళాశాల పూర్వ విద్యార్థినని నాటి రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన శాస్త్రవేత్తలు, ఐఎఎస్లు, రాజకీయ నాయకులు, సినీ నటులు, సామాజిక ఉద్యమకారులు, ఇతర నాయకులను తయారు చేసిన సంస్థగా నిజాం కళాశాలకు చరిత్ర ఉందన్నారు. తన మాతృ విద్యా సంస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వ స్థాయిలో పెండింగ్లో ఉన్న నిధులు విడుదలకు సిఎం రేవంత్రెడ్డితో చర్చించి విడుదల చేస్తానని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రా ష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నెరెల్ల శారద, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎ.వి. రాజశేఖర్, డా. ఫర్జానాఖాన్, ఉదయరాణి, సుధామలక్ష్మి, కె.రేవతి, జి.పద్మ, ఉమాదేవి, ఈశ్వరీబాయి, షాహిన్, అఫ్రోస్ తదితరులు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: TGCPGET: ముగిసిన కామన్ పిజి ఎంట్రన్స్ పరీక్షల దరఖాస్తు గడువు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870