Bhatti Vikramarka will be the CM.. Harish Rao

భట్టి విక్రమార్క సీఎం అయితారామే: హరీష్ రావు

హైదరాబాద్‌: ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్‌ షర్ట్స్‌ వేసుకుని.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో సీఎం అయితారామే అని కూడా అసెంబ్లీలో హరీష్ రావు పేర్కొన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు రూ. 1,27,208.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హరీష్ రావు వివరించారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు విద్యుత్ శాఖ‌కు చెల్లించామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ భ‌ట్టి విక్ర‌మార్క త‌ప్పుడు లెక్క‌లు చెబుతూ స‌భ‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏడాది కాలంలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసి కొత్త‌గా ఒక్క ప్రాజెక్టు కూడా క‌ట్ట‌లేదు. మా హ‌యాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా మంచినీటిని అందించాం. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆస్తుల క‌ల్ప‌న చేసింది.. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం అప్పులు చేసి క‌మీష‌న్ల కోసం పంచుకుతిన్నారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. అస‌లు తాము అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా భ‌ట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. త‌మ హ‌యాంలో వ‌డ్లు కొన్నాం.. ఠంచ‌న్‌గా పైస‌లు ఇచ్చాం. భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Related Posts
జమ్మూ లో కాంగ్రెస్ ..హర్యానా లో బిజెపి విజయం
jK haryana results

కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు హర్యానా ప్రజలు..జమ్మూ & హర్యానా లో కాంగ్రెస్ విజయం కహాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉదయమే Read more

బంగ్లాదేశ్‌లో భారతీయ పర్యాటకుడిపై హింసాత్మక దాడి
Hindus in bangladesh

భారతీయ పర్యాటకుడు సయన్ ఘోష్ తన బంగ్లాదేశ్ పర్యటన అనంతరం గాయాలపాలై, తీవ్రంగా మనోవేదనకు గురై ఇండియాకు తిరిగి వచ్చారు. 21 సంవత్సరాల సయన్ ఘోష్ తన Read more

మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్
LIC Mutual Fund launched Multi Asset Allocation Fund

ముంబై : భారతదేశంలోని ప్రసిద్ధ ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, డెట్ మరియు బంగారంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్ అయిన ఎల్ఐసి Read more

గుజరాత్‌ ప్రజలు కొత్త విజన్‌ కోసం వేచి చూస్తున్నారు: రాహుల్‌ గాంధీ
People of Gujarat are waiting for a new vision.. Rahul Gandhi

ఆహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం Read more