హైదరాబాద్: ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో సీఎం అయితారామే అని కూడా అసెంబ్లీలో హరీష్ రావు పేర్కొన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు రూ. 1,27,208.. ఇలానే కొనసాగితే 5 ఏళ్లలో అయ్యే అప్పు రూ. 6,36,040 కోట్లు అని హరీష్ రావు వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉచిత విద్యుత్కు రూ. 65 వేల కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించామని స్పష్టం చేశారు. కానీ భట్టి విక్రమార్క తప్పుడు లెక్కలు చెబుతూ సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసి కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మా హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తుల కల్పన చేసింది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి కమీషన్ల కోసం పంచుకుతిన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అసలు తాము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. తమ హయాంలో వడ్లు కొన్నాం.. ఠంచన్గా పైసలు ఇచ్చాం. భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్రావు స్పష్టం చేశారు.