BCCI : పాకిస్థాన్ ను వేరుగా ఉంచాలని ఇండియా ను కోరిన, బీసీసీఐ

Read Time:  1 min
BCCI : పాకిస్తాన్, భారత్‌ను వేరు గ్రూప్‌లో ఉంచాలని బీసీసీఐ విజ్ఞప్తి
BCCI : పాకిస్తాన్, భారత్‌ను వేరు గ్రూప్‌లో ఉంచాలని బీసీసీఐ విజ్ఞప్తి
FONT SIZE
GET APP

BCCI : జమ్మూకశ్మీర్లోని పహల్గామ్‌లో జరిగిన హృదయవిదారక ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించడంతో, బిసిసిఐ ఐసిసి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)కి లేఖ రాస్తూ, రాబోయే టోర్నమెంట్లలో భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచవద్దని అభ్యర్థించింది. క్రికెట్ మైదానంలో కూడా ఇరు దేశాల మధ్య ఘర్షణలు తగ్గించాల్సిన అవసరం ఉందని బిసిసిఐ స్పష్టం చేసింది.ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాలు క్షీణించడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు చాలా కాలంగా నిలిపివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఐసిసి బిసిసిఐ డిమాండ్‌ను అంగీకరిస్తే పాకిస్థాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగలే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఏడాది ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ భారత గడ్డపై జరుగనున్నది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది.

BCCI : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై బీసీసీఐ ప్రతిపాదన

ఐసిసి, బిసిసిఐ, పిసిబి (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు)ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్ జట్టు భారతదేశానికి రావడం లేదు. తటస్థ వేదికపై తమ మ్యాచులను ఆడనుంది. 2025లో ఆసియా కప్ కూడా జరగనుంది. ఇందులో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు ప్లాన్ చేయబడ్డాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్ షెడ్యూల్ ఎలా రూపొందించబడుతుందో చూడడం ఆసక్తికరంగా మారింది

Read More : Suresh Raina: కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికి తప్పు చేశాడు: సురేష్ రైనా

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.