Latest News: Asia Cup 2025 – యూఏఈపై భారత్ ఘన విజయం

Read Time:  1 min
Asia Cup 2025
Asia Cup 2025
FONT SIZE
GET APP

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నీని భారత జట్టు అద్భుత విజయంతో ప్రారంభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో యూఏఈతో బుధవారం తలపడిన టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలిచి, తన ఆధిపత్యాన్ని చాటింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి అభిమానులను ఉర్రూతలూగించింది.ముందుగా టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు మొదటి ఓవర్ నుంచే దాడి ప్రారంభించారు. పేస్ బౌలర్లు కొత్త బంతుతోనే ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.

పవర్ ప్లే ముగిసేలోపే యూఏఈ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా భారత్ బౌలర్లు వరుస విజయాలతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. చివరికి యూఏఈ జట్టు కేవలం 112 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో ముఖ్యంగా జస్ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) లు అద్భుతంగా రాణించారు. బుమ్రా తన స్వింగ్, వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేశాడు.

కెప్టెన్ ముహమ్మద్ వసీం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలిషన్ షరఫు(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), కెప్టెన్ ముహమ్మద్ వసీం(22 బంతుల్లో 3 ఫోర్లతో 19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/7), పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే(3/3) అద్భుత బౌలింగ్‌తో యూఏఈ పతనాన్ని శాసించారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ (Abhishek Sharma) (16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(2 బంతుల్లో సిక్స్‌తో 7 నాటౌట్) మెరుపులు మెరిపించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖి ఒక వికెట్ తీసాడు. అభిషేక్, గిల్ ధాటికి 93 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది.

 Asia Cup 2025
Asia Cup 2025

అదే జోరులో క్యాచ్ ఔట్‌

58 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సిక్స్ తో ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. హైదర్ అలీ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే స్టేడియం బయటకు పంపించాడు. ఆ మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులు డాట్ కావడంతో తొలి ఓవర్‌లోనే 10 పరుగులు వచ్చాయి. ముహమద్ రోహిద్ ఖాన్ వేసిన రెండో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఓ బౌండరీతో పాటు సిక్సర్ బాదాడు.

ధ్రువ్ పరాశర్ వేసిన మూడో ఓవర్‌లో అభిషేక్ శర్మ వరుసగా 6, 4 బాదడంతో టీమిండియా 3 ఓవర్లలోనే 38 పరుగులు చేసింది.జునైద్ సిద్దిఖీ వేసిన నాలుగో ఓవర్‌లో అభిషేక్ శర్మ ఓ భారీ సిక్స్ బాది అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. సిమర్జిత్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని శుభ్‌మన్ గిల్ బౌండరీ బాది భారత విజయాలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-india-win-the-toss-and-elect-to-bowl/international/544869/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.