appsc in group 2 mains exams

గ్రూప్‌-2 మెయిన్స్‌ యథాతథం : ఏపీపీఎస్సీ

అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తప్పవంటూ వార్నింగ్

అమరావతి : గ్రూప్-2మెయిన్స్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని తెలిపారు. సోషల్ మీడియాలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దు అని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

గ్రూప్‌-2 మెయిన్స్‌ యథాతథం  ఏపీపీఎస్సీ

రెండు సెషన్లలో పరీక్షలు

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రద్దు అంటూ వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దు అని రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈనెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మద్యాహ్నాం 3.గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది అని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది.

గ్రూప్-2మెయిన్స్‌పై అభ్యర్థుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలకు రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.

Related Posts
మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting 1

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. Read more

డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక
tarrif

ఈ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రపంచంలో మరో టారిఫ్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్, BRICS దేశాలు అమెరికా Read more

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు
supreme court appoints special sit for tirumala laddu probe

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో Read more

AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. Read more