हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Cable Bridge : హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు

Sudheer
Cable Bridge : హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరొక ప్రతిష్టాత్మక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజేంద్రనగర్‌లోని మీరాలం చెరువు పై కొత్త తీగల వంతెన (Cable Bridge) నిర్మాణానికి రూ.430 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇది నగర ట్రాఫిక్‌ను సులభతరం చేయడంలో ముఖ్యపాత్ర పోషించనుంది.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నిర్మాణం

ఈ ప్రాజెక్టును మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మొత్తం 2.65 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్లు కలిగిన ఈ తీగల వంతెన అత్యాధునిక సాంకేతికతతో నిర్మించనున్నారు. భద్రత, డిజైన్, మౌలిక సదుపాయాల పరంగా ఇది ప్రపంచస్థాయి ప్రమాణాలను పాటించేలా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని సమాచారం.

ప్రయాణ సౌలభ్యానికి పెద్ద ఊరట

ఈ కేబుల్ బ్రిడ్జ్ పూర్తి అయితే రాజేంద్రనగర్‌, మిరాలం, నెహ్రునగర్ వంటి ప్రాంతాల ట్రాఫిక్ ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చు. నగరంలోని ఇతర ప్రాంతాలతో మౌలిక రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అది ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా కూడా నిలవనుంది. ఈ వంతెన నగర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశముంది.

Read Also : YCP : ఇంత మంచి చేసి ఓడిపోవడం షాకే – సజ్జల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870