📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

Author Icon By Sudheer
Updated: February 23, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు మిర్చి యార్డు పర్యటన సమయంలో వైసీపీ అధినేత జగన్‌కు సరైన భద్రత కల్పించలేదని ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఈ అంశాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.

జగన్‌కు తగిన భద్రత కల్పించలేదు

గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు తగిన భద్రత కల్పించకుండా, ఆయనకు హాని కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. జగన్‌కు ఎక్కడికెళ్లినా జడ్ ప్లస్ భద్రత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అదనంగా, ప్రతిపక్ష హోదాను కూడా జగన్‌కు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రాముఖ్యత ఉంటుందని, ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయని విమర్శించారు.

పాలకులు రైతులను పట్టించుకోవడం లేదు

రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యంగా, రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, పాలకులు రైతులను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఈ పరిస్థితులను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని, ఎవరినీ భయపడి అసెంబ్లీకి వెళ్లకపోవడం లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో అధికారపక్షానికి తెలియజేయడమే తమ ధ్యేయమని తెలిపారు.

AP Assembly Jagan yv subbareddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.