ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళలు అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలపై పెరిగిపోయిన దాడులు, అత్యాచారాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం దృష్టికి తేవడానికి వినతి పత్రాలు అందించారు.
మహిళలకు రక్షణ కరువు
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్కూల్, కాలేజ్ లాంటి విద్యాసంస్థలే కాక ఇంట్లో ఉన్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం మూగవతిగా మారిందని విమర్శించారు.
రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులు
అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వైసీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు గట్టిగా నిఘా వ్యవస్థలు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసి, నేరాలను అరికట్టాలని కోరుతున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల విషయంలో వైసీపీ ఆందోళనలతో ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Read Also : Sonam Raghuvanshi: భర్త శవం వద్ద ప్రియురాలిని ఓదార్చిన ప్రియుడు