YS Vijayamma property : వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె వైఎస్ షర్మిలకు బినామీగా వ్యవహరిస్తున్నానన్న ఆరోపణలను విజయమ్మ ఖండించారు. తాను పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెన్నై ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ నిజమని, క్లాసిక్ రియాల్టీ కంపెనీ వాటాలను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ఆమె తెలిపారు. ఈడీ జప్తు అంశంపై జగన్ వాదనలను రాజకీయ ఎత్తుగడగా కొట్టిపారేశారు.
Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

ఇదే సమయంలో షర్మిల కూడా ఈ కేసులో తన వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపుగా ఈ వివాదాన్ని మలుస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29కు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: