Latest news: YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా

Read Time:  1 min
YS Sharmila statement
YS Sharmila statement
FONT SIZE
GET APP

విజయవాడ, అక్టోబరు 30 ప్రభాతవార్త ప్రతినిధి: రాష్ట్రంపై ప్రధాని మోడీ(Prime Minister Modi) సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని, మొంథా తుపాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం(YS Sharmila) చేశారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోడీ, ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. మొంథా తుపాన్ రైతన్నకు అపార నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చిందని, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయని, ఖరీఫ్ సీజన్లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయని, 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు.

Read also: జెమీమా ను గంభీర్‌తో పోలుస్తున్న నెటిజన్లు

YS Sharmila
YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా

రైతాంగానికి రూ.20 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని షర్మిలా ఆరోపణ

ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు అని, రూ.20 వేల కోట్లకు పైగానే రైతులకు అపార నష్టం జరిగిందని(YS Sharmila) వివరించారు. మొంథా తుపాన్ను జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రళయం మిగిల్చిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు మోడీ ప్రకటించాలన్నారు. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.