📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది : షర్మిల

Author Icon By sumalatha chinthakayala
Updated: April 16, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తనపై బొత్స చేసిన కామెంట్స్‌పై షర్మిల కౌంటర్‌

అమరావతి: వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో పని చేయకుండా రాష్ట్ర సంపదను దోచుకుతిన్నది ఎవరో ప్రజలకు తెలుసు అని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జైలుకు వెళ్లి ఖైదీలను పరామర్శించడానికి సమయం ఉందిగానీ.. శాసన సభకి వెళ్ళడానికి ధైర్యం లేదు అని నిన్న షర్మిల చేసిన కామెంట్స్‌పై బొత్స స్పందిస్తూ ఆమెకు పని లేదు.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెట్టేదానికి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు.

చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు షర్మిలకు కనిపించవని..ఎంతసేపు మాజీ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించమే పనిగా పెట్టుకుందని బొత్స విమర్శించారు. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో… రాష్ట్ర ప్రజానీకానికి తెలుసంటూ జగన పాలనపై మరోసారి షర్మిల నిప్పులు కక్కారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని..పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని..151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని..చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారని షర్మిల గుర్తు చేశారు.

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

కాగా, ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జగన్ కు గుంటూరు లో భద్రత కల్పించకపోవటం పైన వైసీపీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ఈ సారి అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే అంశం పైన పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. తన పైన వ్యాఖ్యలు చేసిన బొత్సాకు ఘాటు రిప్లై ఇచ్చారు. వైసీపీని సవాల్ చేసారు.

Botsa Satyanarayana Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.