YS Jagan: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం సమీపంలోని గోదావరి నది వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు నదిలోకి దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అమరావతిలోని ప్రముఖ ఎస్ఆర్ఎం (SRM) విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్న ఈ విద్యార్థులు మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది.
Read Also: Voter: సమాజం బాగుపడాలంటే ఓటరు ఆలోచన మారాలి!

వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
మొత్తం ఏడుగురు విద్యార్థులు నీటిలోకి దిగగా, వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరావతి ఎస్ఆర్ఎం కళాశాల విద్యార్థుల మృతి వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదువుతూ, ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: