YS Jagan Visit: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 6న) ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో, వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.
Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

పర్యటన వివరాలు
షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా ఇబ్రహీంపట్నం చేరుకుని జోగి రమేష్ నివాసానికి వెళ్తారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరిపిన దాడిలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు గాయపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఇప్పటికే వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధితులకు అండగా ఉండటంతో పాటు, రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులపై కూడా జగన్ ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: