ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టులను అడ్డుకునేలా పిల్స్ వేయిస్తున్నారని విమర్శించారు. ఇది నేరుగా యువత భవిష్యత్తును దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు.
Read also: AP: వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ
YS Jagan
వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతోందని
టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, రహేజా ఐటీ పార్కుల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే ఏపీలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. అయితే ఈ కీలక ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం ద్వారా వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతోందని ఆరోపించారు. ప్రతి అడుగులోనూ రాష్ట్రాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం
ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఉద్దేశించి నారా లోకేశ్ సూటి ప్రశ్న వేశారు. యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలను అడ్డుకోవడం ద్వారా రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ పురోగతిని అడ్డుకునే ఈ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: