📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: YS Jagan: వ్యక్తిగత హాజరు ఇవ్వాలన్న మినహాయింపు: హైకోర్టు

Author Icon By Rajitha
Updated: November 11, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YS Jagan: జగన్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేయండి సిబిఐకి హైకోర్టు ఆదేశాలు. విజయవాడ : వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్ జగన్ (ys jagan) అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశించింది. గత నెలలో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే యూరప్ నుంచి వచ్చిన తర్వాత ఈనెల 14 వరకూ వ్యక్తిగతంగా వచ్చి పర్యటన వివరాలు తెలపాలని జగన్కు సీబీఐ కోర్టు షరతు విధించింది. యూరప్ వెళ్లి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తాను కోర్టుకు వస్తే భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని తెలిపారు.

Read also: AP: అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ క్రికెట్ అకాడమీ భూమిపూజ

YS Jagan: వ్యక్తిగత హాజరు ఇవ్వాలన్న మినహాయింపు

యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక

YS Jagan: అందుకే హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతివ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనపై స్పందించాలని సీబీఐని ఆదేశిస్తూ న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చాక కోర్టులో హాజరు కావాలన్న ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరుతూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్ గత గురువారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. అక్టోబరు 1 నుంచి 30లోగా 15 రోజులపాటు జగన్ యూరప్ పర్యటన నిమిత్తం సీబీఐ కోర్టు అనుమతి ఇస్తూ వెళ్లే ముందు పర్యటన వివరాలు, ఫోన్ నంబరు, ఈమెయిల్ వివరాలు సమర్పించాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh politics CBI court latest news Telugu News YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.