Murder case : రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు వెనుక ఆయన స్నేహితుడే కుట్ర పన్నినట్లు తెలంగాణ పోలీసులు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా కిరాయి హంతకులతో హత్య చేయించి, ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్టు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 14న ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో ఒక కారు పడిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారును బయటకు తీయగా అందులో శ్రీనివాస్ (48) మృతదేహం లభించింది. తలపై గాయాలు కనిపించడంతో ప్రమాదం కాదనే అనుమానం పోలీసులకు కలిగింది. మృతుడు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.
Read Also:AP Local Elections: మరో హామీ అమలు దిశగా చంద్రబాబు అడుగులు?
కుటుంబ సభ్యులు హత్య అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విచారణలో శ్రీనివాస్ స్నేహితుడు వేణుమాధవరెడ్డి ఈ కుట్రకు సూత్రధారిగా ఉన్నట్లు బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీ అనే ముగ్గురు వ్యక్తులను కిరాయి హంతకులుగా నియమించినట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని లావాదేవీల కోసం తన జీఎస్టీ ఖాతాను వాడుకునేందుకు శ్రీనివాస్ అనుమతి ఇవ్వగా, బకాయిలపై నోటీసులు రావడంతో డబ్బు చెల్లించాలని ఆయన ఒత్తిడి తెచ్చాడు. దీంతో అతడిని తొలగించాలనే ఉద్దేశంతో నిందితుడు కుట్ర పన్నాడు. విజయవాడకు వెళ్తున్న సమయంలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద కారులోనే హత్య చేసి, అనంతరం మృతదేహంతో కారును పాలేరు జలాశయంలోకి తోసి ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: