📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chittoor Dist : ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 నెలలకే దారుణం

Author Icon By Sudheer
Updated: April 15, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాజీ నగర్‌కు చెందిన యువతి యాస్మిన్ భాను అనుమానాస్పదంగా మృతి చెందింది. మొదట ఇది ఆత్మహత్యగా భావించగా, పోలీసులకు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాస్మిన్ భాను వేరే మతానికి, వేరే సామాజిక వర్గానికి చెందిన సాయితేజ్ అనే యువకుడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి ఈ ఏడాది ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే ఆమె మృతి చెందడం చిత్తూరు వాసుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

ఇది ఖచ్చితంగా ప్రూవ్ హత్యానే

పెళ్లి తర్వాత భర్తతో వేరిగా జీవిస్తున్న యాస్మిన్.. తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రావడంతో ఆదివారం పుట్టింటికి వెళ్లింది. అదే రోజు ఆమె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే యాస్మిన్ భాను భర్త సాయితేజ్ వాదన మేరకు ఇది హత్య గా భావిస్తున్నారు. తన భార్యను నవ్వుతూ పంపించానని, మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని మార్చురీలో చూపించారని ఆయన వాపోయారు. అంతేకాకుండా, పెళ్లి తర్వాత తమకు ప్రాణహాని ఉందని అప్పటికే వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, రక్షణ కూడా కోరిన విషయం వెలుగులోకి వచ్చింది.

తండ్రి , మేనల్లుడు పరారీ

ఈ ఘటనలో ప్రధాన అనుమానితులైన యాస్మిన్ తండ్రి షౌకత్ అలీ, అతడి మేనల్లుడు లాలూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యాస్మిన్ మృతి ఒక పరువు హత్యే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. సాయితేజ్ మాత్రం తన భార్యకు న్యాయం జరగాలని, బాధితులకు కఠిన శిక్షలు పడాలని కోరుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Chittoor Dist Google News in Telugu young woman killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.