📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Yoga Research Center: గుంటూరులో యోగా రీసెర్చ్ సెంటర్

Author Icon By Anusha
Updated: December 3, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే తొలిసారిగా అపెక్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ యోగా అండ్ నేచురోపతిను నిర్మించడానికి కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో రూ. 750 కోట్లతో ఈ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ ఎయిమ్స్ తరహాలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ రీసెర్చి ఇన్స్‌స్టిట్యూట్ (Yoga Research Center) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

Read Also: Pawan kalyan: పార్టీ నేతలకి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

Yoga Research Center in Guntur

ఇందుకు అనుగుణంగా 450 పడకలతో అన్ని రకాల వసతులతో నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి కూడా నిర్మించనున్నారు. ఇదే కాకుండా యోగా రిసెర్చ్‌ (Yoga Research Center) కు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా మరో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

దానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆయుష్ మంత్రి పార్లమెంట్‌లో వెల్లడించారు.గుంటూరు జిల్లాలో సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా అండ్‌ నేచురోపతి (CRIYN) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్‌ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ (AYUSH Minister Pratap Rao Jadhav) తెలిపారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య మంగళవారం (డిసెంబర్ 2) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు జాదవ్ సమాధానం ఇచ్చారు.

ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది

రూ. 93.82 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరు జిల్లా నడింపాలెంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పరిపాలన, వ్యయపరమైన అనుమతులు మంజూరయ్యాయని వెల్లడించారు.

ఈ పరిశోధన కేంద్రానికి అనుబంధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఈ యోగా రీసెర్చ్ కేంద్రానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 15 ఎకరాల భూమి కేటాయించిందని ఆయుష్ మంత్రి వివరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Ayush Ministry Guntur yoga center latest news Naturopathy hospital Telugu News Yoga research institute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.