ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే తొలిసారిగా అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిను నిర్మించడానికి కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో రూ. 750 కోట్లతో ఈ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ ఎయిమ్స్ తరహాలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ రీసెర్చి ఇన్స్స్టిట్యూట్ (Yoga Research Center) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
Read Also: Pawan kalyan: పార్టీ నేతలకి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

ఇందుకు అనుగుణంగా 450 పడకలతో అన్ని రకాల వసతులతో నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి కూడా నిర్మించనున్నారు. ఇదే కాకుండా యోగా రిసెర్చ్ (Yoga Research Center) కు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా మరో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
దానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆయుష్ మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు.గుంటూరు జిల్లాలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ (AYUSH Minister Pratap Rao Jadhav) తెలిపారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మంగళవారం (డిసెంబర్ 2) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు జాదవ్ సమాధానం ఇచ్చారు.
ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది
రూ. 93.82 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరు జిల్లా నడింపాలెంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పరిపాలన, వ్యయపరమైన అనుమతులు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఈ పరిశోధన కేంద్రానికి అనుబంధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఈ యోగా రీసెర్చ్ కేంద్రానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 15 ఎకరాల భూమి కేటాయించిందని ఆయుష్ మంత్రి వివరించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: