Latest News: WWC 2025: టీమిండియాకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

Read Time:  1 min
WWC 2025
WWC 2025
FONT SIZE
GET APP

భారత మహిళల క్రికెట్ జట్టు (Team India) చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని, ఈ విజయం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పేర్కొన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (WWC 2025) లో భారత జట్టు విజేతగా నిలవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జట్టుకు అభినందనలు తెలియజేశారు.

Read Also: Big Breaking: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్

“భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. మన అమ్మాయిలు దేశం మొత్తం గర్వపడేలా చేశారు. వారి అద్భుతమైన ప్రదర్శన, అలుపెరుగని పట్టుదల, తిరుగులేని పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చాయి.

WWC 2025
WWC 2025

ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.2025 ప్రపంచకప్ (WWC 2025) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్వితీయమైన విజయం సాధించి భారత జట్టు కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక సందర్భంలో జట్టు సభ్యులకు, సహాయక సిబ్బందికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “మన ఛాంపియన్లకు నా హృదయపూర్వక అభినందనలు” అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.