ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్ (Twitter) వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. వినాయకుని గొప్పతనాన్ని, పండుగ ప్రాధాన్యతను హృద్యంగా వివరించారు.హైందవ సంప్రదాయంలో కొన్ని పండుగలు ప్రాంతీయంగా మాత్రమే కనిపిస్తాయి. కానీ వినాయక చవితి మాత్రం అందరినీ ఒకే తాటిపైకి తీసుకురాగలదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఒకటిగా ఈ పండుగను జరుపుకుంటారు అని పవన్ పేర్కొన్నారు. ఇది గణపతికి లభిస్తున్న విశ్వవ్యాప్త భక్తిని చూపిస్తుంది.పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గణాలకు అధిపతిగా భావించే లంబోదరుడిని ఈ పవిత్ర రోజున ప్రార్థించాలని అన్నారు. ప్రజలు చేసే ప్రతి శుభ కార్యం కూడా విజ్ఞ (obstacles) లేకుండా పూర్తవ్వాలంటే, గణపతిని పూజించడం అవసరం అన్నారు. ఆయన ఈ సందర్బంగా గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.
మట్టి వినాయకుడిని పూజించండి: పవన్ వినమ్ర విజ్ఞప్తి
ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి కూడా పవన్ కల్యాణ్ ప్రజలకు ఓ వినమ్ర విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుడిని (Clay Ganesha) మాత్రమే పూజించాలని సూచించారు. వాతావరణంపై నెగటివ్ ప్రభావం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించకూడదన్నారు. మన భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.వినాయక చవితి కేవలం దేవుడిని పూజించే పండుగ మాత్రమే కాదు. ఇది కుటుంబం, స్నేహితులు, సమాజాన్ని ఒకచోట చేర్చే సందర్భం. సామూహిక ఉత్సవాలు, సంస్కృతిక కార్యక్రమాలు మన సమాజానికి కొత్త ఉత్సాహం తెస్తాయి. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గుర్తుచేస్తూ, సమగ్ర సమాజాభివృద్ధిలో ఇలాంటి పండుగల పాత్రను గుర్తించారు.
ప్రకృతిని ప్రేమించాలి – పవన్ స్పష్టమైన సందేశం
పండుగలు జరుపుకుంటూనే ప్రకృతిపై ప్రేమ చూపించాలి. పవన్ కల్యాణ్ చేసిన పిలుపు కూడా ఇదే. మట్టి వినాయకుడిని ప్రతిష్టించి, పూజించి, తర్వాత నీటిలో నిర్వీర్యం చేయడం పర్యావరణానికి హానికరం కాదు. ఇది సంప్రదాయాన్ని పాటించడమే కాకుండా, భవిష్యత్తు కోసం బాధ్యత చూపించడమని ఆయన స్పష్టం చేశారు.చివరిగా, వినాయక చవితి సందర్భంగా గణపతి భక్తులందరికీ పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read Also :