కడప (Kadapa) జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric scooter) ఒక్కసారిగా పేలిపోవడంతో వెంకట లక్ష్మమ్మ (వయస్సు 62) అనే వృద్ధ మహిళ అగ్నికి ఆహుతయ్యారు. ఈ ప్రమాదంతో ఆమె కుటుంబం గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
ప్రమాదం వివరాలు:
వివరాల్లోకి వెళితే, పోట్లదుర్తి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ (62) కుటుంబ సభ్యులు రోజూ లాగే తమ ఎలక్ట్రిక్ స్కూటర్కు రాత్రి ఇంట్లో ఛార్జింగ్ పెట్టారు. అయితే, తెల్లవారుజామున ఛార్జింగ్లో ఉన్న స్కూటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. స్కూటర్కు సమీపంలోనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మపై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
పోలీసులు చేపట్టిన చర్యలు:
విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రజలకు హెచ్చరిక:
ఎలక్ట్రిక్ వాహనాలను తప్పనిసరిగా నాణ్యమైన కంపెనీల నుండి కొనుగోలు చేయాలని, చౌక బ్రాండ్లు లేదా నకిలీ ఛార్జింగ్ ఉపకరణాలు వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇంట్లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కనీస భద్రతా నియమాలను పాటించాలి. ఛార్జింగ్ సమయంలో వాహనం దగ్గర ఎవరూ ఉండకుండా చూసుకోవడం, వేడి గదుల్లో ఛార్జింగ్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
Read also: PRC: ఆప్కో ఉద్యోగులకు 2022 పిఆర్సీ అమలు